Thursday, April 18, 2024

తిరుపతి వెళ్తుండగా మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్:  మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం నిమిత్తం తిరుపతి వెళుతుండగా ముదిరెడ్డిపల్లి సాల్గుతి కంపెనీ దగ్గర కారును గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వెలిజాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయాలు కాగా మరో ఇద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను రాజాపూర్ బిజెపి మండల అధ్యక్షులు కావలి రామకృష్ణ ఎస్ విఎస్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News