Friday, March 29, 2024

కష్టాల్లో రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

Rajasthan royals lost 3 wickets

ముంబై:  ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తడబడుతోంది. రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రాహుల్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఇన్నింగ్స్‌ మూడో బంతికే డేంజరస్‌ బెన్‌ స్టోక్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఖాతా తెరవకుండానే రాజస్థాన్‌ వికెట్‌ కోల్పోయింది. పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌ అందుకోవడంతో మనన్‌ వోహ్రా(8 బంతుల్లో 12; ఫోర్‌, సిక్స్‌) పెవిలియన్‌ బాట పట్టాడు. రిచర్డ్‌సన్‌ వేసిన స్లో బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన జోస్‌ బట్లర్‌(13 బంతుల్లో 25) క్లీన్‌ బౌల్డ్‌య్యాడు. దీంతో 10 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ సాంసన్‌(41)కు జతగా శివమ్‌ దూబే(11)‌ క్రీజ్ లో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News