Friday, April 19, 2024

రాజస్థాన్ లక్ష్యం 155

- Advertisement -
- Advertisement -

Rajasthan target is 155 runs

 

అబుదాబి: ఐపిఎల్‌ 14వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డిసి 20  ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రేయస్ అయ్యర్ 43 పరుగులు చేసి నాల్గో వికెట్ రూపంలో ఔటయ్యాడు. హెట్ మెయిర్ 28 పరుగులు చేసి ముస్తాఫిజర్ బౌలింగ్ లో  ఔటయ్యాడు. రిషబ్ పంత్ 24 పరుగులు చేసి ముస్తాఫిజర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. శిఖర్ ధావన్ ఎనిమిది పరుగులు చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. పృధ్వీ షా 10 పరుగులు చేసి చేతన్ సకారియా బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రెండో వికెట్ పై అయ్యర్-పంత్ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.అక్షర్ పటేల్ 12 పరుగులు చేసి సకారియా బౌలింగ్ లో మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. లలిత్ యాదవ్ (14), రవిచంద్రన్ అశ్విన్ ఆరు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో ముస్తాఫిజర్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీయగా త్యాగి, తివాటియా చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News