Thursday, March 28, 2024

ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి…. పాక్ లో చిక్కుకుపోయాడు…

- Advertisement -
- Advertisement -

Rajasthan teen stuck in pakistan

జైపూర్: రాజస్థాన్ లో ఓ యువకుడు ప్రియురాలు కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఏకాంతంగా మాట్లాడుతున్నపుడు యువతి తల్లిదండ్రులు రావడంతో తప్పించుకునే క్రమంలో భారత్ సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి వెళ్లిపోయాడు. అతడిని తీసుకరావాలని బిఎస్ఎఫ్ అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కుమ్ హారో కాటిబ్బా ప్రాంతంలో గ్రెమ్ రామ్ మేఘావల్ (19) నివసిస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు ఉండడంతో అప్పుడప్పుడు వెళ్లి కలిసి వస్తూ ఉండేవాడు. ప్రియురాలు ఉంటున్న ఊరు భారత్-పాక్ సరిహద్దులో ఉంది. 2020 నవంబర్ లో ప్రియురాలును కలిసేందుకు రామ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు రావడంతో రామ్ పరుగులు తీశాడు. ఈ క్రమంలో సరిహద్దు దాటి పాక్ లోకి వెళ్లిపోయాడు. తన కుమారుడు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఓ రాజస్థాన్ నుంచి తమ దేశంలోకి వచ్చిన యువకుడిని అరెస్టు చేశామని పోలీసులకు పాక్ సైనిక అధికారులు తెలిపారు. పాక్ నుంచి ఆ యువకుడిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు స్థానిక బిజెపి నాయకులతో కలిసి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. బిఎస్ఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. చట్టపరమైన చర్యలు పూర్తైన తరువాత అతడిని భారత్ కు అప్పగిస్తామని పాక్ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News