- Advertisement -
ముంబై: ఐపిఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (221/6) భారీ స్కోరు చేసింది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్(91) స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ కెరీర్లో 22వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రతీ బంతిని బౌండరీ బాదాలనే కసితో అతడి బ్యాటింగ్ సాగింది. మరో ఎండ్లో దీపక్ హుడా(64) సిక్సర్ల వర్షం కురిపించాడు. శివమ్ దూబే వేసిన 13వ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన హుడా శ్రేయస్ గోపాల్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు సిక్సర్లు బాదేశాడు. విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(40: 28 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
- Advertisement -