Tuesday, April 23, 2024

రాష్ట్రపతి, ప్రధానితో ‘దాదాసాహెబ్’ రజనీకాంత్

- Advertisement -
- Advertisement -

Rajinikanth met President and Prime Minister

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వారితో సమావేశమైన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసిన రజనీకాంత్ వారి శుభాకాంక్షలు అందుకోవడం సంతోషంగా ఉందని తెలియచేశారు. రజనీకాంత్ వెంట ఆయన సతీమణి లత కూడా ఉన్నారు. ఈ నెల 25న ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఫాల్కే అవార్డును స్వీకరించిన రజనీకాంత్ ఈ అవార్డును తన గురువు, దివంగత దర్శకుడు కె బాలచందర్‌కు, సాంకేతిక నిపుణులకు, అభిమానులకు, తాను సినిమా రంగంలో ప్రవేశించడానికి ప్రోత్సహించిన తన మిత్రుడు, తాను బస్సు కండక్టర్‌గా పనిచేసినపుడు డ్రైవర్‌గా ఉన్న తన సహచరుడు రాజ్ బహదూర్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News