- Advertisement -
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ తన కొత్త రాజకీయ పార్టీని డిసెంబర్ 30న ప్రకటించినున్నట్లు వెల్లడించిన విషయం తెలిసింది. దీంతో వచ్చే ఏడాది మేలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ రాజకీయ పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీ కార్యాచరణపై అనేక మందితో రజనీకాంత్ సంప్రదింపులు జరుపుతున్నారు. శనివారం రజనీతో భేటీ అయిన తర్వాత ఆయన సలహాదారు తమిళరువి మణియన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాట 234 సీట్లల్లో రజనీ పార్టీ పోటీ చేస్తుందని, రజనీకాంత్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతారని మణియన్ అన్నారు.
Rajinikanth’s party to contest 234 seats in TN: Manian
- Advertisement -