- Advertisement -
ఢిల్లీ: కరోనా వైరస్తో చికిత్స పొందుతూ రాజ్యసభ ఎంపి అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన కూడా మరణాలు మాత్రం ఆగడంలేదు. కరోనా ఎవరిని వదిలిపెట్టడంలేదు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్ కరోనా వైరస్ సోకడంతో రాజ్కోట్లోని ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడంతో ఎయిర్ అంబులెన్స్లో చెన్నైలో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ భరద్వాజ్ తుది శ్వాస విడిచారు. ఎంపి అభయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. లాయర్, సామాజిక కార్యకర్త ప్రజలకు సేవచేశాడని మోడీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- Advertisement -