ఫిట్నెస్లో ఎప్పుడూ టాప్ లెవెల్లో ఉండే రకుల్ ప్రీత్సింగ్ కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న వారికి కొన్ని టిప్స్ చెబుతోంది. యోగా, జిమ్లో వ్యాయామాల గురించి వివరిస్తోంది. యోగా, ప్రాణాయామం అనేవి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచుతాయట. కానీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం జిమ్ చేయాల్సిందేనని అంటోంది రకుల్ప్రీత్ సింగ్. యోగా చేసినంత మాత్రాన బరువు తగ్గరని ఖచ్చితంగా చెబుతోంది. అలాగే యోగా చేసినా, జిమ్ చేసినా డైట్ విషయంలో కొన్ని నియమాలను పాఠించాలని సూచిస్తోంది. జిమ్ చేసి వచ్చిన వెంటనే ఫ్రూట్ జ్యూస్లు అస్సలు తీసుకోకూడదని రకుల్ చెబుతోంది. ఎందుకంటే ఫ్రూట్ జ్యూస్లోని షుగర్ కంటెంట్ మనం చేసిన వ్యాయామాలకు యాంటీగా వర్క్ చేస్తుందట. తద్వారా బరువు తగ్గడం సాధ్యం కాదని చెబుతోంది. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న వారు వ్యాయామాలు, యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని రకుల్ప్రీత్ సింగ్ పేర్కొంది.