- Advertisement -
ముంబై : సుశాంత్ మరణం తరువాత దాఖలు అయిన డ్రగ్స్కేసుకు సంబంధించి నటి రకుల్ ప్రీత్సింగ్ శుక్రవారం ఎన్సిబి ఎదుట హాజరు అయ్యారు. తన నివాసంలో దొరికిన మాదకద్రవ్యాలు పూర్తిగా తోటి నటి రియాకు చెందినవే అని తెలిపారు. ఆమె ఎక్కడినుంచో తెప్పించుకున్న డ్రగ్స్ తన నివాసానికి వచ్చేవని, తరువాత వాటిని తీసుకువెళ్లేవారని ఎన్సిబి ముందు అంగీకరించారు. రియాతో తాను డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించారు. ముందు తనకు ఎన్సిబి సమన్లు అందలేదని ప్రకటించిన రకుల్ శుక్రవారం నేరుగా ఎన్సిబి కార్యాలయానికి వెళ్లి విషయాలు వివరిస్తూ వాంగూల్మం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా సుశాంత్ మరణంపై దర్యాప్తు క్రమాన్ని పక్కదోవ పట్టించేలా డ్రగ్స్కేసును ముందుకు తెచ్చారని సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు.
- Advertisement -