క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడి
ముంబయి: ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, తాను ప్రస్తుతం స్వీయ క్వారంటైన్లో ఉన్నానని రకుల్ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం రకుల్ హైదరాబాద్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహిస్తున్న మేడే అనే సినిమా షూటింగ్లో ఉన్నారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని, గత కొద్ది రోజులుగా తనను కలుసుకున్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, కోలుకోగానే షూటింగ్లో పాల్గొంటానని ఆమె ట్వీట్ చేశారు. అజయ్ దేవ్గన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మేడే చిత్రం షూటింగ్ డిసెంబర్ 11న ప్రారంభమైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, అంగీరా ధర్ కూడా నటిస్తున్నారు. అజయ్ విమానం పైలట్గా, రకుల్ సహపైలట్గా నటిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రంలో అమితాబ్ పాత్రను రహస్యంగా ఉంచారు.