Thursday, April 25, 2024

మరోసారి వేశ్య పాత్రలో…

- Advertisement -
- Advertisement -

వేశ్య పాత్రల్లో నటిగా నిరూపించుకునేందుకు బోలెడంత స్కోప్ దొరుకుతుంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నాయికలు వేశ్య పాత్రల్లో అద్భుత అభినయంతో మెప్పించారు. మాధురి ధీక్షిత్, టబు, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్, కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ అగ్ర కథానాయికలు వేశ్య పాత్రల్లో మైమరిపించారు. టాలీవుడ్‌లోనూ మంజు భార్గవి,  జయసుధ, భానుప్రియ లాంటి టాప్ హీరోయిన్స్ వేశ్య పాత్రల్లో మురిపించారు. వేదం చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో సరికొత్త ఆహార్యంతో మెప్పించింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సీనియర్ల బాటలోనే వేశ్య పాత్రల్లో మెప్పించాలని ప్రయత్నిస్తోంది. ‘మన్మధుడు 2’ తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్ అన్నదే లేదు.

ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘మర్జవాన్’ సినిమాలో మోడ్రన్ వేశ్య పాత్రలో నటించి తన హాట్ హాట్ అందాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకుల్ ప్రయత్నించింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రే దక్కడం విశేషం. బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఓ మోస్ట్ పాపులర్ వేశ్యకి సంబంధించిన నిజజీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో రకుల్ లీడ్ రోల్ చేసేందుకు సంతకం చేసిందని సమాచారం. మరొక హిందీ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. రకుల్ ఇప్పటికే ‘భారతీయుడు 2’లో రెండో నాయికగా నటిస్తోంది.

Rakul Preet Singh to play Veshya Role!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News