టాలీవుడ్లో ఓ ఆసక్తికరమైన వార్త షికారు చేస్తోంది. అది నిజమో, కాదో… ఇప్పటివరకు తెలియదు కానీ, అదే నిజమైతే టాక్ ఆఫ్ ది టౌన్ ఆ ప్రాజెక్టే అవుతుంది. అదేమిటంటే… మహేష్ బాబు ప్రొడక్షన్లో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతోందట. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని టాక్. ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టి పరశురామ్ కథకి ఓకే చెప్పాడు మహేష్. దీంతో వంశీ పైడిపల్లి ఖాళీ అయిపోయాడు. ఈలోగా చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. అది మహేష్కి సైతం నచ్చిందట. దీంతో ఈ సినిమాని నేనే నిర్మిస్తానని ఈ సూపర్స్టార్ ముందుకు వచ్చినట్టు సమాచారం. మహేష్ తన ప్రొడక్షన్లో వరుసగా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అడవి శేష్తో ‘మేజర్’ సినిమాను నిర్మిస్తున్నాడు. అన్నీ కుదిరితే మహేష్ తదుపరి ప్రాజెక్ట్ చరణ్తోనే కావచ్చు.
Ram charan next movie in Mahesh babu production