- Advertisement -
న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ కు కరోనా వైరస్ సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ తెలింది. నృత్య గోపాల్ దాస్ ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి రామజన్మభూమి భూమిపూజ శంకస్థాపనలో పాల్గొన్నారు. అయితే యుపి సిఎం ఆదిత్యనాథ్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నృత్య గోపాల్ దాస్ కు సరైన చికిత్స అందించాలని మధుర కలెక్టర్ కు ఆదిత్యనాథ్ ఆదేశించారు. రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యుపి గవర్నర్ ఆనందిబెన్తో పాటు సిఎం ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు వేదికను పంచుకున్నారు. భూమిపూజకు ముందు కూడా ఆలయపూజారి ప్రదీప్దాస్తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కోవిడ్-19 సోకిన విషయం విదితమే.
Ram Temple Trust Head Tests Corona Positive
- Advertisement -