పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సిఎంగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రంగస్వామి చేత లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పుదుచ్చేరి రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రంగస్వామికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
All India NR Congress (AINRC) president N Rangasamy takes oath as the Chief Minister of Puducherry.
The oath is being administered by Puducherry Governor Tamilisai Soundararajan. pic.twitter.com/fN4al885ad
— ANI (@ANI) May 7, 2021
Rangasamy takes oath as the Chief Minister of Puducherry