Thursday, April 25, 2024

బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం

- Advertisement -
- Advertisement -

 Rape of a girl in Warangal rural

వరంగల్ రూరల్: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై జరిగే దాడులను అరికట్టలేకపోతున్నాయి. ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన దామెరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం చేసాడు కామాంధుడు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీశారు. దీంతో బాలిక అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. పెద్దల సమక్షంలో బాలిక శీలానికి రూ.1.78 లక్షలకు గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. దీంతో బాలిక శీలానికి వెల కట్టడం కరెక్ట్ కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ కామాంధుడిని శిక్షించాలని గ్రామస్తులందరూ డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News