Friday, April 19, 2024

పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం…..

- Advertisement -
- Advertisement -

Rape on dead body in Odisha

 

భువనేశ్వర్: పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేసిన సంఘటన అస్సాంలోని గౌహతి ప్రాంతంలో జరిగింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 14 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా చనిపోవడంతో తల్లిదండ్రుల, గ్రామస్థులు ఆదివారం గ్రామ శివారులో గుంత తీసి బాలిక మృతదేహాన్ని పాతిపెట్టారు. సోమవారం తెల్లవారుజామున 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి శ్మశాన వాటికకు వెళ్లి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా ఓ జాలరి చూసి స్థానిక ఎస్‌పి ధనంజయ్ గానావత్‌కు సమాచారం ఇచ్చాడు. అకాన్ చేతులను వెనక్కి కట్టేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అకాన్‌పై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అకాన్ జైలు నుంచి విడుదలై ఈ ఘటనకు పాల్పడ్డాడు. బాలికను లైంగిక వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని గ్రామస్థులు ఆరోఫణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News