- Advertisement -
అమరావతి: మేకలు మేపడానికి వెళ్లిన బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 12 ఏళ్ల బాలిక మేకలు మేపడానికి గ్రామ శివారులోకి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య అమ్మాయికి మాయమాటలు చెప్పి తన ఫోన్లో ఆశ్లీల వీడియోలు చూపించాడు. అనంతరం బాలికను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులు అలస్యంగా చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్లో చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతయ్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
- Advertisement -