Friday, March 29, 2024

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Rape on three years old girl in rajanna sircilla

 

సిరిసిల్ల: ముప్పై ఏళ్ల వ్యక్తి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సదరు వ్యక్తికి ఎనిమిదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు ఎనిమిది మరమగ్గాలు ఉన్నాయి. భార్య, పిల్లలు శుభాకార్యానికి వెళ్లడంతో ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఎదురింట్లో ఉండే చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి పిలిచాడు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడడంతో ఏడ్చుకుంటూ తన తల్లి వద్దకు వెళ్లింది. రక్త స్రావం కనిపించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News