Friday, April 19, 2024

అడ్డాకూలీపై అత్యాచారం…. ఆపై హత్య

- Advertisement -
- Advertisement -

Rape on women after murder

కామారెడ్డి: అడ్డాకూలీపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. మహిళ(32) తాను నివసించే తండాలో పనిలేకపోవడంతో జిల్లా కేంద్రంలో అడ్డా కూలీగా పని చేస్తోంది. నవంబర్ 17న కూలీకి వెళ్లిన భార్య ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త 18న స్థానిక లింగాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆరా తీయగా ప్రకాశ్ అనే వ్యక్తితో పరిచయమన్నట్లు తెలిసింది. వెంటనే ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. పని కోసమని మహిళను బైక్‌పై తీసుకెళ్లాలని లింగాపూర్ శివారులో ప్రాంతంలోకి రాగానే ఆమె మద్యం తాగించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశానని ఒప్పకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News