- Advertisement -
తిరువనంతపురం: మహిళ తలపై రాయితో కొట్టి ఆమెపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ మధ్యాహ్నం సమయంలో కంప్యూటర్ క్లాసులకు వెళ్తుండగా ఆమెను బాలుడు ప్లాంటేషన్ ప్రాంతానికి లాకెళ్లాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె తలపై రాయితో బాదాడు. అనంతరం ఆమె చేతులు కట్టేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అనంతరం ఆమె గొంతు కోయడానికి ప్రయత్నించినప్పుడు అతడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మార్షల్ ఆర్ట్ జూడోలో జిల్లా స్థాయి ఆటగాడిగా గుర్తించారు.
- Advertisement -