హైదారాబాద్ : కంప్యూటర్ యుగంలో, శాస్త్ర సాంకేతక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాదిస్తున్నప్పటికి ప్రజలు మాత్రం తాము చేసే వ్యాపారంలో నష్టం వచ్చిన, ఇంట్లో ఆపదలు సంభవించిన, ఆనారోగ్యానికి గురైనపుడు దొంగ బాబాలు, స్వామీజీలు, ఫకీర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోతున్నారు. తాజాగా మల్కాజ్ గిరిలో ఓ దారుణం వెలుగుచూసింది. దుష్ట శక్తులను పారద్రోలతానని చెప్పి ఓ పకీరు 27 ఏళ్ల వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని మల్కాజ్ గిరీకి చెందిన ఓ వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడికి 5 లక్షల అప్పు ఉంది. అది తీర్చడానికి ఎంత కష్టపడ్డా కూడా అప్పు తీర్చలేకపోతున్నాడు.
దీంతో అతడు నాంపల్లికి చెందిన మహ్మద్ యూనిస్ ఖాన్ అనే ఫకీరు ఆశ్రయించాడు. అతడు దుష్ట శక్తుల ఆవాహాన వల్లే ఇదంతా జరుగుతుందని, వాటిని వదిలిస్తానని చెప్పాడు. ఆ తర్వాత డ్రైవర్ అతని భార్యతో కలిసి మౌళాలిలో ఉన్న స్నేహితుడి ఇంట్లో ఫకీరును మళ్లీ కలిశారు. అక్కడ దుష్టశక్తులను తరిమే పూజలో భాగంగా దుస్తులు విప్పాలని డ్రైవర్ భార్యను ఆదేశించాడు ఫకీరు. అందుకు ఆమె తిరస్కరించింది. కాని భర్త వారించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నగ్నంగా మారింది. ఆ తర్వాత ఫకీరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఫకీరుతో పాటు బాధితురాలి భర్తను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.