Thursday, March 28, 2024

రేషన్ డీలర్ల కమిషన్ రూ. 36.36 కోట్ల నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

Ration Dealers Commission released Rs 36.36 crore

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు రూ. 36.36 కోట్లు కమిషన్‌కు సంబంధించిన మొత్తాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులను ఒకటి, రెండు రోజుల్లో జిల్లా మేనేజర్ కార్యాలయం నుండి నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో జమ చేస్తామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసలు చొప్పున కమిషన్ చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణి చేయడం జరిగిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News