Thursday, April 25, 2024

స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ ఇటీవలే తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. హీరో రవితేజ కూడా సెట్స్‌లో అడుగుపెట్టినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ‘క్రాక్’ షూటింగ్‌ను ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలను తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో ద్వారా యూనిట్ సభ్యులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం.. సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి శానిటైజర్స్ ఉపయోగిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలిసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న రవితేజ “స్టేషన్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో…” అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్తున్నట్లు వీడియో చివరలో చూపించారు. కాగా సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Ravi Teja’s Krack Movie Shooting Resume

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News