Friday, March 29, 2024

కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎమ్‌కు ఆర్‌బిఐ సూచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పేమెంట్ అగ్రిగేటర్(పిఎ) సేవలు అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పేటీఎమ్‌కు మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్‌కు ఆర్‌బిఐ సూచించింది. అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త వినియోగదారులను చేర్చుకోవద్దని తెలిపింది. కాగా ఆర్‌బిఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్ద ప్రభావం ఉండబోదని పేర్కొంది. పేమెంట్ అగ్రిగేటర్‌కు సంబంధించి ఆర్‌బిఐ ఇదివరకే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని అనుసరించే తన పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్‌ను చెల్లింపు సేవలకు బదిలీ చేయాలనిపేటీఎమ్ ఆర్‌బిఐని కోరింది. అందుకు ఆర్‌బిఐ తిరస్కరించింది. దీంతో అవసరమైన పత్రాలను పేటీఎమ్ గత ఏడాది సెప్టెంబర్‌లో మరోసారి ఆర్‌బిఐకి సమర్పించింది. తాజాగా ఆర్‌బిఐ 120 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేటీఎంకు తెలిపింది.

త్వరలో అనుమతులు లభిస్తాయని పేటీఎమ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వినియోగదారులు వివిధ పద్ధతుల ద్వారా ఇ-కామర్స్, వ్యాపారులకు చెల్లింపులు చేస్తుంటారు. వ్యాపారులకు ప్రత్యేకమైన చెల్లింపుల వ్యవస్థంటూ అవసరం లేకుండా లావాదేవీలు పూర్తిచేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. అయితే ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఇకామర్స్ సేవలతో పాటు, పేమెంట్ అగ్రిగేటర్ సేవలను ఒకే కంపెనీ అందించడానికి వీల్లేదు. అందుకు వేరే వ్యాపారం ఉండాలి. ఈ నేపథ్యంలో పేమెంట్ అగ్రిగేటర్ సేవలను పేటీఎమ్ సర్వీసెస్‌కు బదిలీ చేయాలని వన్ 97 కమ్యూనికేషన్ ఆర్‌బిఐని కోరింది. ఇదిలావుండగా రోజర్ పే, పైన్ ల్యాబ్స్, క్యాష్ ఫ్రీ, సిసి అవెన్యూస్ వంటివి ఇప్పటికే పేమెంట్ అగ్రిగేటర్ అనుమతులు పొందాయి. బిల్‌డెస్క్, పేయూ వంటివి ఆర్‌బిఐ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News