Friday, March 29, 2024

చెలరేగిన డివిలియర్స్.. ముంబై లక్ష్యం 202

- Advertisement -
- Advertisement -

RCB Setup 202 Runs Against MI

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ముంబై జట్టుకు బెంగళూరు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌(54), అరోన్‌ ఫించ్‌(52‌) అర్ధశతకాలతో రాణించారు. అయితే, మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) విఫలమయ్యాడు. ఇక, చివర్లో ఏబీ డివిలియర్స్‌(55 నాటౌట్:‌ 24 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగల భారీ స్కోరు సాధించింది.

RCB Setup 202 Runs Against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News