Friday, April 19, 2024

పాత మలక్ పేటలో కొనసాగుతున్న రీపోలింగ్….

- Advertisement -
- Advertisement -

Re polling start in old malak pet

హైదరాబాద్: పాత మలక్ పేటలో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 69 కేంద్రాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. రిటర్నింగ్ అధికారి సంధ్యారాణిని విధుల నుంచి తప్పించి ఆమె స్థానంలో శైలజను నియమించనట్టు జిహెచ్ఎసంసి ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. 276 మంది అధికారులు రీపోలింగ్ లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన బ్యాలెట్ పత్రాలలో కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి ఉండడంతో సిపిఐ అభ్యర్థి ఫిర్దౌస్ ఫాతిమా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నిక రద్దైయ్యే వరకు 3450 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఎడమ చేతి చూపుడు వేలుకు బదులుగా మధ్య వేలుకు సిరా చుక్క వేస్తున్నారు. 54, 502 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News