Friday, April 26, 2024

2022 నాటికి రియల్‌మి రూ.10 వేల 5జి ఫోన్

- Advertisement -
- Advertisement -

Realme Rs 10 thousand 5G phone by 2022

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నాటికి రూ.10 వేల లోపు ధరలో 5జి ఫోన్లను రియల్‌మి ఆవిష్కరించనుందని రియల్‌మి ఇండియా సిఇఒ మాధవ్ సేథ్ పేర్కొన్నారు. దేశంలో 5జిని అనుసరించేందుకు గాను పలు కార్పొరెట్ కార్యక్రమాలను కూడా సంస్థ చేపట్టింది. చిప్ సెట్ తయారీ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములతో కలసి రాబోయే ఏడాదిలో రూ.10 వేల లోపు 5జి స్మార్ట్ ఫోన్లను తీసుకురావడం సంస్థ లక్ష్యమని తెలిపారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2021 మేలో నెంబర్ వన్ 5జి స్మార్ట్ ఫోన్‌గా నిలిచిన రియల్‌మి పలు 5జి అంశాలపై పరిశ్రమ ప్రముఖులతో ఒక వెబినార్‌ను నిర్వహించింది.

Realme Rs 10 thousand 5G phone by 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News