Friday, March 29, 2024

జూబ్లీహిల్స్‌లో రియల్టర్ రవీందర్ రెడ్డిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -
- Advertisement -

Student dead in Andhra Pradesh

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగిన దాడిలో నారాయణ పేటకు చెందిన రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి చెందాడు. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 6 గంటలకు రవీందర్ రెడ్డి చనిపోయాడు. బుధవారం జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో రవీందర్ రెడ్డిపై అల్లుడు మోహన్‌రెడ్డి కత్తితో దాడి చేశాడు. బేగంపేట ప్రాంతంలో విక్రయించిన స్థలానికి సంబంధించిన కమీషన్ రూ.6లక్షలు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డిపై దాడి చేశాడు. అనంతరం మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Realtor Ravinder reddy died after Knife Attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News