Friday, March 29, 2024

ఢిల్లీ కాలుష్యం తగ్గించేందుకు ఏం చేస్తారు ?

- Advertisement -
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ప్రశ్నల వర్షం

SC sets aside granting furlough to asaram bapu son

న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యంపై శనివారం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఈ శీతాకాలం వేళ ఢిల్లీలో కాలుష్య పరిస్థితులపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ పరిస్థితి ఎంత దిగజారింతో మీరే చూడండి. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరిస్తున్నాం. అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా , యుపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తరువాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది.

అయితే వాటిని దహనం చేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు వెల్లడించింది. పంజాబ్‌లో రైతులు పంట వ్యర్ధాలు దహనం చేయడంతో గత వారం రోజులుగా ఢిల్లీ లో నెలకొన్న పరిస్థితులకు కారణమైంది. దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంది. అని వెల్లడించింది. అయితే ఈ సమాధానంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని ఎందుకు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ కాలుష్య పరిస్థితులకు అది ఒక కారణం మాత్రమే. మిగిలిన వాటి గురించి ఏం చేస్తున్నారు? కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారు ? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి. మీ ప్రణాళిక ఏంటో మాకు వెంటనే తెలియచేయండి. రెండు రోజుల లాక్‌డౌన్ ఏమైనా విధిస్తారా ? అని కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News