Thursday, April 25, 2024

ఐపిఎస్ అధికారి వివాహానికి హాజరైన రేగొండ ఎస్సై

- Advertisement -
- Advertisement -

Regonda SI attended IPS Marriage

మనతెలంగాణ/రేగొండ: రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం జరుగుతున్న ఎపిఎస్ అధికారి డాక్టర్ బొంత బాలస్వామి వివాహానికి రేగొండ ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్‌గౌడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఐపిఎస్ అధికారి బాలస్వామి గతంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ప్రొబెషనరీ పిరియడ్‌లో భాగంగా రేగొండ ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్‌గౌడ్‌తో కలిసి విధులు నిర్వహించారు. అనంతరం ఆయన నాగర్ కర్నూల్‌కు బదిలీపై వెళ్ళారు. ఎస్సైతో పాటు మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు మైస బిక్షపతి, బొట్ల రవి సామ్రాట్, గండ్ర యువసేన నాయకుడు రజినీకాంత్, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు చిలువేరు సంపత్‌మాదిగ, రాష్ట్ర నాయకులైన రమేష్ మాదిగ, డ్రైవర్ గంటే రవి, తదితరులు వివాహానికి హాజరై ఐపీఎస్ అధికారికి వివాహా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News