Friday, March 29, 2024

మొక్కలు నాటిన రేఖా శ్యామ్ నాయక్

- Advertisement -
- Advertisement -

 హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలోఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమా రెడ్డి మొక్కను నాటారు.  తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ తెలిపారు.
తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారంగా ఉందని, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ప్రాధాన్యతల నేపథ్యంలో రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయం లో మొక్కను నాటిన సందర్బంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమా రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేశామని, అన్ని గ్రామాలు, దేవాలయాలకు పంపిణీ జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News