Thursday, April 18, 2024

సింగరేణి పరీక్ష ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Release of Singareni Junior Assistant Written Exam Result

వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ జాబితా
పరీక్ష రాసిన 77,898 మందిలో 49,328 మంది అర్హత
మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు
జేఎన్‌టియూహెచ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రెడ్డి,
సింగరేణి డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్‌a సంయుక్త ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4వ తేదీ నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్‌టియూ హెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ శనివారం రాత్రి 8 గంటలకు విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను www.scclmines.com వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వారు తెలిపారు. ఈ రాత పరీక్షను తెలంగాణలోని 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా మొత్తం 98,882 మంది అభ్యర్థులకు గాను 77,898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ సారి నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించగా 49,328 మంది అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు సాధించారని, 28,570 మంది పరీక్షలో క్వాలిఫై కాలేదని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల నుంచి సూచనలను, అభ్యంతరాలను స్వీకరించినట్లు వారు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే మూడు ప్రశ్నలకు సంబంధించి సరైన సమాధానం నాలుగు అప్షన్లలో లేదన్న విషయాన్ని రూడీ చేశారని, దీంతో ఈ మూడు ప్రశ్నలకు అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించామన్నారు.

వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా: చంద్రశేఖర్

సింగరేణి రాత పరీక్షకు సంబంధించి అర్హత సాధించిన వారి రిజర్వేషన్, స్థానికత, మార్కులను పరిగణనలోకి తీసుకొని వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను కంపెనీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ (పర్సనల్) ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News