Thursday, April 25, 2024

ఎంపి మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

Relief for MP Maloth Kavitha in High Court

 

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంపి మాలోత్ కవితకు శుక్రవారం నాడు హైకోర్టులో ఊరట లభించింది. ఈక్రమంలో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన ఉన్నత తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపి కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలావుండగా పార్లమెంటు ఎన్నికల్లో మాలోత్ కవిత ప్రచార సమయంలో మాలోత్ కవిత అనుచరుడు షౌకత్ అలీ వద్ద 9 వేల 400 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలోత్ కవిత, షౌకత్ అలీపై 2019లో ఐపిసి 188, 171 బి ప్రకారం బూర్గం పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐపిసి 171 బి కింద మాలోత్ కవిత, షౌకత్ అలీపై నేరాభియోగాలు రుజువైనట్లు ప్రకటించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. కాగా ఎంపి కవిత హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News