Thursday, April 25, 2024

వివాహ వేడుకలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

- Advertisement -
- Advertisement -

Republic day celebrations

 

జగిత్యాల : నూతన వధూవరులు గణతంత్ర దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. ఈ వేడుక జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది. పట్టణంలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఓ వివాహ వేడుకలో నూతన వధూవరుల తో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి పెళ్లి వేడుకలు నిర్వహించడం అందరిలో జాతీయ భావాన్ని నింపింది. పట్టణంలోని శ్రీనివాస్ కుమార్తె వాసవి వివాహం మెట్‌పల్లికి చెందిన చొక్కయ్య కుమారుడు భార్గవ్ తో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు భార్గవ్ ప్రతియేటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం అని ఈసారి గణతంత్ర దినోత్సవం రోజు తన వివాహం ఉండడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి కావడంతో వివాహ వేడుకల్లోనే ప్రత్యేకంగా మూడు రంగుల మువ్వన్నెల జెండా ఆవిష్కరించామని తెలిపారు.

Republic day celebrations At wedding ceremony
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News