వరంగల్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు బయలుదేరిన కొడుకు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. యాపల్ గూడలో శనివారం రాత్రి అనారోగ్యంతో రమణమ్మ మృతిచెందింది. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు-కోడలు రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదం వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం శాంతినగర్ వద్ద చోటుచేసుకుంది. కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా… వారి కుమారై తీవ్రంగా గాయపడింది. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. కొడుకు మృతితో తల్లిఅంత్యక్రియలు నిలిపోయాయి. రోడ్డుప్రమాదంలో మృతుడిని రిటైర్డ్ సిఐ విజయ్ కుమార్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి.
Retired CI Dies in Road Accident At Warangal Urban