ముంబై: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్లో అపార ప్రతిభ దాగివుందని టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. భారత్కు లభించిన అద్భుత క్రికెటర్లలో పంత్ ఒకడని ప్రశంసించాడు. యువరాజ్, సెహ్వాగ్ల మాదిరిగానే పంత్ కూడా విధ్వంసక బ్యాటింగ్ చేయడంలో దిట్ట అనడంలో సందేహం లేదన్నాడు. బౌలర్ ఎవరైనా ధాటిగా ఆడడంలో పంత్ మంచి నైపుణ్యం సాధించాడన్నాడు. రానున్న రోజుల్లో టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగే సత్తా పంత్కు ఉందన్నాడు. ఒకటి రెండు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన అతన్ని తక్కువ అంచన వేయలేమన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా పంత్కు ఉందన్నాడు. ఇక, ఈసారి ఐపిఎల్ జరుగుతుందా లేదా అనే దాని గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. కరోనా పూర్తిగా తగ్గే వరకు క్రికెట్ గురించి ఆలోచించడం మంచిది కాదన్నాడు. సాధ్యమైనం త్వరగా ఈ మహమ్మరి అంతం కావాలని కోరుకుంటున్నానని రైనా పేర్కొన్నాడు. సహచక క్రికెటర్ చాహల్తో ఇన్స్ట్రాగ్రామ్లో ముచ్చటించిన రైనా ఈ విషయాలు వెల్లడించాడు.