- Advertisement -
మహారాష్ట్ర : నాసిక్లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. బావిలో ముందు ఆటో పడడం, దాని మీదే బస్సు పడిపోవడంతో ఆటోలో ఉన్న వారంతా నలిగిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక అందరూ చనిపోయారు. అతివేగంతో ఆటో, బస్సు ఒకదానికొకటి ఢీకొని అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి.
నాసిక్లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బావి లోతు 70 అడుగులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Road accident death toll in Nashik rises to 20
- Advertisement -