Thursday, April 25, 2024

బైకును ఢీకొట్టిన ఆటో: ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం మండలం నరసాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురురికి తీవ్రగాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News