Tuesday, April 16, 2024

కారు-బైకు ఢీ: ఇద్దరు అక్కడిక్కడే మృతి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తుర్కలపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, బైకు ఢీకొని తుర్కలపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులను దుర్గమ్మ(40), పల్లె రామస్వామి (42)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News