Saturday, April 20, 2024

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Road accident in Mancherial district

ఆటో, డిసిఎం వ్యాన్ ఢీ:  ఇద్దరు దుర్మరణం

మన తెలంగాణ/ మంచిర్యాల: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డిసిఎం వ్యాన్, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. లక్సెట్టిపేట సిఐ నారాయణ నాయక్ కథనం ప్రకారం.. సంఘటన వివరాలీవిధంగా ఉన్నాయి. ఆటో జిగిత్యాల జిల్లా ధోన్ ఊరు గ్రామంకు వెళ్తుండగా రాయపట్నం నుండి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న డిసిఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న దాసరి ప్రమీల అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురిని అంబులెన్స్‌లో లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. తీవ్రగాయాలైన తిరుపతి, రవి, విజయ్, శ్రీనివాస్‌లను అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సంంఘటనా స్థలాన్ని మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News