Friday, March 29, 2024

బైకును ఢీకొట్టిన లారీ.. సీనియర్ అడ్వకేట్ స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేటలో రంగాధాంపల్లి అమరవీరస్థూపం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి మృతిచెందాడు. నంగునూర్ మండలం ముండ్రాయి నుంచి అడ్వకేట్ సిద్దిపేటకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. లారీ బలంగా ఢీకొట్టడంతో దశమంతరెడ్డి ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News