వర్గల్: దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన వర్గల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం గోసాన్పల్లి గ్రామానికి చెందిన పాకనాటి కిషన్(45) హైదరాబాద్లో వాచ్మెన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం దుబ్బాక ఉపఎన్నిక దృష్టా ఓటు వేసేందుకు స్వగ్రామానికి సైకిల్ పై వెళ్తుండగా గౌరారం గ్రామ శివారులో వెనక నుంచి అతివేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గజ్వెల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుని సోదరుడు ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Road Accident While Going To Vote At Wargal Mandal