Thursday, March 28, 2024

హుస్నాబాద్ ఎసిపి ఇంట్లో చోరీ..

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: హుస్నాబాద్ ఎసిపి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల హుస్నాబాద్ ఎసిపిగా బాధ్యతలు చేపట్టిన వాసాల సతీష్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఎసిపి ఇంట్లో లేని సమయంలో కొంతమంది దుండగులు చోరీ చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. అద్దె ఇంట్లోకి ఎసిపి పూర్తిస్థాయిలో వస్తు సామాగ్రి తీసుకురాకపోవడంతో వస్తువులేమి చోరీకి గురికాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Robbers committed theft at Husnabad ACP house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News