Thursday, April 18, 2024

వ్యాపారి కళ్లల్లో కారం చల్లి.. డబ్బు సంచి లాక్కెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

Robbers

మాదన్నపేట్: ఓ చికెన్ వ్యాపారి కళ్లలో కారం చల్లి డబ్బు సంచిని లాక్కొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మలక్‌పేట్‌కు చెందిన ఆదిల్(28) వృత్తిరీత్యా చికెన్ షాపులకు కోడ్లను సరఫరా చేస్తుంటాడు. తిరిగి సాయంత్రం షాపుల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తుంటాడు. ఆదివారం రాత్రి 10 గంటలకు షాపుల వద్ద డబ్బులు వసూళ్లు చేసే క్రమంలో సంతోష్‌నగర్ రక్షాపురం ఎస్.బి.ఐ ఎటిఎం వద్దకు రాగానే ద్విచక్ర వాహనం పై ఇద్దరూ వ్యక్తులు అడ్డగించారు.

ఆదిల్ కళ్లల్లో కారం చల్లి చేతిలో ఉన్న డబ్బు సంచి లాక్కొన్ని ద్విచక్ర వాహనంపై పారిపోయారు. ఆదిల్ గట్టిగా అరవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడు రూ. 90వేల నగదు సంచిని లాక్కొని పారిపోయిన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు వెల్లడించారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితున్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Robbers Snatched Cash Bag At Santosh Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News