- Advertisement -
ముంబయి : దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ వివిధ టెలివిజన్ చానెళ్లు, క్రీడా వెబ్సైట్లతో ఫోన్లో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక తాము చేసే ప్రతి పనిని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకొంటున్నారు. తాజాగా క్రికెటర్ల మధ్య ఒక చాలెంజ్ మొదలైంది. అదే ‘కీప్ ఇట్ అప్’.. అంటే బంతి కిందపడకుండా ఆడడం. ఇప్పుడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ అనిల్ కుంబే ్లతమదైన శైలిలో ఈ చాలెంజ్ను పూర్తి చేశారు. రోహిత్ శర్మ బ్యాట్ హ్యాండిల్తో ఆడితే, కుంబ్లే చేతితో ఆడారు. ఇక వీరిద్దరూఈ చాలెంజ్కు శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానె, రిషబ్ పంత్, వీరేంద్ర సెవాగ్, వివిఎస్ లక్ష్మణ్, కెఎల్ రాహుల్లను నామినేట్ చేశారు.
- Advertisement -