న్యూఢిల్లీ: న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్ కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా భారత్ స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. ఆదివారం మౌంగ్ మాంగనుయ్ వేదికగా జరుగిన ఐదవ టీ20లో రోహిత్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడ్డాడు. సింగిల్ తీసే క్రమంలో వేగంగా పరుగెత్తిన రోహిత్ కుడి కాలు పిక్క కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్ గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత రోహిత్ ఫీల్డింగ్ కూడా చేయలేదు. దీంతో రోహిత్ గాయం కారణంగా వన్డే, టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బిసిసిఐ అధికారు తెలిపారు. బుధవారం నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను సొంత గడ్డపై కివీస్ ను మట్టికరిపించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అదే జోరుతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
Rohit Ruled Out of ODI and Test Series Due to Calf Injury