- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. మద్యం తాగి వచ్చిన రౌడీషీటర్ భాగ్యరాజ్ రైల్వే ఉద్యోగి రాకేష్ పై దాడి చేశాడు. రాకేష్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రౌడీషీటర్ భాగ్యరాజ్ ను అదుపులోకి తీసుకుంటుండగా పోలీసులపైన దాడి చేశాడు. ప్రస్తుతం భాగ్యరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -