Friday, April 26, 2024

రెవెన్యూ అధికారులపై దాడి: ఉప్పల్ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

Rowdies attack on revenue department officers

మేడ్చల్: కబ్జాకు గురైన భూమి వద్దకు రెవెన్యూ అధికారులు వెళ్తే దాడికి ప్రయత్నించారని ఉప్పల్ ఎంఎల్‌ఎ భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉప్పల్ ఎంఎల్ఎ మీడియాతో మాట్లాడారు.  కేసులు నమోదైన వారే తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. విచారణ తరువాత నిజానిజాలు బయటికొస్తాయని, విచారణ తరువాత తనపై ఆరోపణలు చేసిన వారిపై దావా వేస్తానని స్పష్టం చేశారు. కబ్జాకు గురైన భూమికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేశారని తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూకబ్జాదారులపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని స్థానికులు తహసీల్దార్‌కు చెప్పారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News