Friday, March 29, 2024

మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

RPF Constable saves woman life in Secunderabad

ఇరుక్కున్న ప్రయాణికురాలు
మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
అధికారులు, ప్రయాణికుల ప్రశంసలు అందుకున్న కానిస్టేబుల్ దినేష్ సింగ్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. దీంతో అతనిపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. దక్షిణ మధ్య రైల్వే మండల విభాగం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు ఎక్కబోతుండగా జారి కిందపడింది. అక్కడే ఉన్న రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమై ఆ మహిళ ప్రాణాలు కాపాడారు.

నసీమా బేగం అనే మహిళ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ సదరు కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే, ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ దినేష్ సింగ్‌పై ఉన్నతాధికారులు, నెటిజన్లు ప్రశంస్లు కురిపిస్తున్నారు. కాగా, ఇదే సమయంలో రైలులో ఉన్న వ్యక్తి చైను లాగగా రైలు కాసేపు నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ కాగా, జరిగిన ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News